Pawan Kalyan: సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. రూ.కోటి చెక్కు అందజేత

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.

Update: 2024-09-11 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరద బీభత్సం కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొందరు కట్టుబట్టలతో రోడ్డుపడగా మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఈ క్రమంలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు సీఎం రిలీఫ్ ఫండ్‌ (Chief Minister's Relief Fund)కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే వరద విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఉదయం పవన్, సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతరం వారిద్దరూ వరద సహయక చర్యలపై కాసేపు చర్చించారు. 


Similar News