బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. MLC క్లారిటీ ఇదే!

మాజీ మంత్రి, ప్రెజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పానున్నారనే ప్రచారం సాగింది.

Update: 2023-04-19 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ప్రెజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పానున్నారనే ప్రచారం సాగింది. అయితే ఇదే అంశంపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదంతా తప్పుడ ప్రచారమే అన్నారు. కేసీఆర్ లీడర్ షిప్ పై పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు. కొందరు దద్దమ్మలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే ఏప్రిల్ 23న చేవెళ్లలో జరిగే బీజేపీ బహిరంగ సభలో సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా సమక్షంలో మహేందర్ రెడ్డి చేరాతరని రెండురోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News