MLA Venkataramana Reddy : యోగా పూర్వీకులు అందించిన వెలకట్టలేని విద్య

యోగా మన పూర్వీకులు అందించిన వెలకట్టలేని విద్య అని,ఇది అతి పురాతనమైనప్పటికే నేటి సమాజానికి అతి ఆధునికమైన యోగ విద్య అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-10-27 14:05 GMT

దిశ, కామారెడ్డి : యోగా మన పూర్వీకులు అందించిన వెలకట్టలేని విద్య అని,ఇది అతి పురాతనమైనప్పటికే నేటి సమాజానికి అతి ఆధునికమైన యోగ విద్య అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి( MLA Venkataramana ReddY ) అన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..కామారెడ్డి ప్రజలకు ఉచితంగా యోగ నేర్పించడంతో పాటు..ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకోవడం ఒక మంచి సాంప్రదాయమన్నారు. జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపినందుకు మరొకసారి అభినందలు తెలియజేస్తూ ఇంకా యోగను కామారెడ్డి పట్టణంలోనీ అన్ని వార్డుల్లో విస్తృతపరచాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయి నేషనల్ వెళ్తున్న సభ్యులను ఆయన శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సురేష్ , గరిపల్లి అంజయ్య, డాక్టర్ విశ్వనాథం, తోట సతీష్, ఉదయ్, టౌన్ బిల్డర్ శీను, అంతి రెడ్డి, రఘు కుమార్, అంజయ్య, సురేందర్, రాజ్ కుమార్, సురేష్, అన్వేష్, వేణు గోపాల్ రావు, భోగి రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News