మరిది చేతిలో వదిన దారుణ హత్య.. కారణం ఇదే..!

మామ ఆసుపత్రి ఖర్చుల విషయంలో వదినను మరిది హతమార్చారు...

Update: 2024-09-06 06:42 GMT

దిశ, భిక్కనూరు: మామ ఆసుపత్రి ఖర్చుల విషయంలో వదినను మరిది హతమార్చారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మంద పోచయ్యకు ఇద్దరు కుమారులు. ఇద్దరికి ఆస్తులు పంచి ఇవ్వడంతో పాటు, తనకున్న భూమిని కూడా ఇద్దరికి పంచిచ్చారు. కొంతభూమిని తన పేరున ఉంచుకున్నారు.

అయితే పోచయ్య ఆరోగ్యం సరిగా ఉండలేకపోతుండడంతో చిన్న కుమారుడు తరచూ ఆసుపత్రులకు తీసుకెళ్తూ వైద్యం చేయిస్తున్నారు. డబ్బులు ఖర్చవుతుండడంతో వదిన యేసుమణి (42)ని పలుమార్లు డబ్బులు చెల్లించాలని అడిగారు. వాటా కింద ఇవ్వాల్సిన ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా ఇవాళ ఉదయం కూడా తిట్ల దండకం మొదలుపెట్టడంతో, కోపంతో ఊగిపోయిన మరిది సురేష్ చాకుతో వదినను పొడిచారు. దీంతో యేసుమణి అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే కాకుండా భూతగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వదినను హత్య చేసిన మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలికి కుమారుడుతో పాటు, భర్త అత్త మామ ఉన్నారు. ఈ మేరకు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలాన్నా పరిశీలించారు. యేసుమణి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News