టీఎస్పీఎస్సీ అధికారులను జైలుకు పంపాలి

తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

Update: 2023-12-13 09:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డ్ ను రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయడం, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు హర్షించదగ్గవి అని అన్నారు.

     గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డ్ చైర్మన్ గంటా చక్రపాణి నుండి మొదలు ఇప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఇటువంటి వారు సమాజంలో తిరగడం చూడలేమని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నామని అన్నారు. కావున ఇందుకు బాధ్యులైన వారందరినీ వెంటనే జైలుకు పంపాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సోహేల్, మహేష్, అమాన్, సుజిత్, విష్ణు, అక్మల్, సింహాద్రి, ఆదిత్య, అఖిలేష్, శశాంక్, కార్తిక్, కైఫ్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News