ప్రమాదం అంచున ప్రయాణం..

మోర్తాడ్ మండలంలోని ధర్మోరా పాలెం గ్రామాల మధ్య గల పెద్ద వాగులో ప్రభుత్వం నిధులతో వాహనాల రాకపోకలకు రోడ్డు నిర్మించారు.

Update: 2024-07-14 15:01 GMT

దిశ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని ధర్మోరా పాలెం గ్రామాల మధ్య గల పెద్ద వాగులో ప్రభుత్వం నిధులతో వాహనాల రాకపోకలకు రోడ్డు నిర్మించారు. కానీ రోడ్డుకు ఇరు ప్రక్కల రక్షణ దిమ్మెలు లేకపోవడంతో వాహనాలు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నాయని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండల కేంద్రాలతో పాటు మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్ళడానికి ఈ మార్గంలో చాలా దగ్గర అవుతుండటంతో ప్రతినిత్యం ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు నిర్మించాలని వాహన దారులు కోరుతున్నారు.


Similar News