కామారెడ్డి జిల్లాలో విషాదం., అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జుక్కల్ మండల పరిధిలోని నాగుల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
దిశ, జుక్కల్: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జుక్కల్ మండల పరిధిలోని నాగుల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం శివారు ప్రాంతంలోకి వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికులు సామాజిక మధ్యమాల్లో మృతదేహాన్ని సంబంధీకులు గుర్తు పట్టేందుకు ఫోటోను షేర్ చేశారు. కావాలనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైన చంపేసీ ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది సస్పె్న్స్గా మారింది. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకనున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.