మడిగెలు అవసరం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి.. సొసైటీ చైర్మన్

అంగడి బజార్ లో నిర్మించిన మడిగెల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య అన్నారు.

Update: 2024-09-11 09:21 GMT

దిశ, భిక్కనూరు : అంగడి బజార్ లో నిర్మించిన మడిగెల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య అన్నారు. బుధవారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని సొసైటీలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన 5 మడిగెల కోసం, దరఖాస్తు చేసుకోవాలని ఒక్కోమడిగెకు 50వేల రూపాయల అడ్వాన్స్ తో పాటు నెలకు 5 వేల రూపాయల కిరాయి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మడిగెలు కావలసినవారు స్థానిక సొసైటీకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫస్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి, మడిగెలు కేటాయించడంలో ప్రాధాన్యతనిస్తామని వివరించారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల రాజిరెడ్డి, డైరెక్టర్లు మద్దూరి నర్సింలు, పెద్ద బచ్చగారి మహిపాల్ రెడ్డి, లింగాల వెంకటి గౌడ్, ఉప్పరి సాయిలు, అంబల్ల మల్లేశం, అందె జయమ్మ, డప్పు జ్యోతి, మానుకోట పోచయ్య, సొసైటీ సీఈఓ గొల్ల నర్సింలు, క్లర్క్ పెద్ద బచ్చగారి గంగారం, కంప్యూటర్ ఆపరేటర్ పసుల రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News