దివ్యాంగులకు అండగా ఉంటా

దివ్యాంగులపై చిన్నచూపు చూడొద్దని... వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం పై ప్రతేక్ష దృష్టి పెట్టాలని, దివ్యాంగులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

Update: 2023-12-19 09:46 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : దివ్యాంగులపై చిన్నచూపు చూడొద్దని... వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం పై ప్రతేక్ష దృష్టి పెట్టాలని, దివ్యాంగులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఖలిల్ వాడిలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ , సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, జెడ్పీ చైర్మన్ దాదాన్న గారి విట్టల్ రావు, రాష్ట్ర ఉమెన్ కమిషన్ సభ్యులు సుధం లక్ష్మి, నగర మేయర్ నీతు కిరణ్ ముఖ్యఅతిథిలు గా హాజరయ్యారు.

    ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరక లోపం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికెట్ లను ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. దివ్యాగులకు భగవంతుడు అంగ వైక్యలం ఇచ్చినా కానీ మానసికంగా చాలా ఉత్సాహవంతులు అన్నారు. ప్రంపంచంలో అనేక మంది మేధావులు దివ్యాంగులే అని పేర్కొన్నారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో నుంచి వచ్చే నిధులతో వారికి వికలాంగులకు ఏ అవసరం ఉన్న అండగా ఉండాలని అధికారులను కోరారు. దివ్యంగులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన ట్రస్ట్ ధన్ పాల్ లక్ష్మి భాయ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీరు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థానం లో ఉండాలని మనసారా కోరారు. సదరం సరిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతు న్నటు తన దృష్టికి వచ్చిందని, జిల్లా సూపరింటెండెంట్ ని కోరుతున్న తెలిపారు. డాక్టర్ ని వెంటనే అపాయింట్ చేసి వారికీ ఇబ్బంది కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి రసూల్ బి, స్నేహ సొసైటీ సిద్దయ్య, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


Similar News