నగరంలో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల సంఘటన సోమవారం మధ్యాహ్నం కలకలం రేపింది.

Update: 2024-03-04 09:09 GMT

దిశ, ప్రతినిధి నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల సంఘటన సోమవారం మధ్యాహ్నం కలకలం రేపింది. నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ ప్రాంతంలోని ఒక ప్రార్థన మందిరం వద్ద ఖండోభ అనే వ్యక్తిని దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. డబ్బులు విషయంలో జరిగిన ఘర్షణలో దస్తగిరి తన వద్ద ఉన్న కత్తితో కండోభాను ఇష్టం వచ్చినట్టు పొడిచాడు.

     తీవ్ర గాయాలైన కండోభాను నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. దస్తగిరి ఖండోబా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసి. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి అద్దెకు ఉండి కూలి పనులు చేస్తున్నట్టు తెలిసింది. తీవ్రంగా గాయపడిన కండోబా పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. ఈ మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


Similar News