రుణం తెచ్చి దాచారు...దొంగలు దోచుకెళ్లారు...

పొదుపు సంఘంలో రుణం తెచ్చి దాచగా చోరీ చేసిన ఘటన భిక్కనూరు మండలం బాగిర్తి పల్లిలో చోటు చేసుకుంది.

Update: 2024-04-05 14:58 GMT

దిశ, భిక్కనూరు : పొదుపు సంఘంలో రుణం తెచ్చి దాచగా చోరీ చేసిన ఘటన భిక్కనూరు మండలం బాగిర్తి పల్లిలో చోటు చేసుకుంది. ఘటన భిక్కనూరు మండలం బాగిర్తి పల్లిలో చోటు చేసుకుంది. రెండిళ్లలో దొంగతనం జరిగి లక్ష రూపాయల నగదు అపరించుకుపోయిన సంఘటన భిక్కనూరు మండలం బాగిర్తి పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన నీల రేణుక రామస్వామి రెండు రోజుల క్రితం

    పొదుపు సంఘంలో రుణం మంజూరు కావడంతో లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఇంట్లో దాచుకుంది. గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి ఆ నగదు మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే ఆ ఇంటిని ఆనుకొని పక్కనే ఉన్న నీలసత్తెవ్వ పోచయ్య ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో వెళ్లిపోయారు. రేణుక రామస్వామి ఇంట్లోమాత్రం నగదు అపహరించుకుపోయినట్లు గ్రామస్తులు వివరించారు. 


Similar News