నిజాం కాలనీలో చోరి…

నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పరిధిలో నిజాం కాలనీ లో దొంగలు పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.

Update: 2024-07-08 12:58 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పరిధిలో నిజాం కాలనీ లో దొంగలు పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. నిజం కాలనీకి చెందిన వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి మూడు తులాల బంగారం, 50 వేల నగదు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. సోమవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో దొంగల ఆనవాళ్ళు లభించాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో చోరీలు జరుగుతున్న ఘటనలు పరిపాటిగా మారుతుంది. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ ఈ మధ్యకాలంలో లోపించడం వల్లే నిత్యం ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.


Similar News