కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జహీరాబాద్ పార్లమెంట్ గెలుపు తప్పనిసరి

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్​ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-03-31 15:00 GMT

దిశ, ఎల్లారెడ్డి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్​ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోల్ ఎమ్మెల్యేలతో పాటు జైరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ శెట్టి, కామారెడ్డి, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్​చార్జ్ నాయకులతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆదివారం హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    నివాసంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించి ఎన్నికల్లో గెలిచే విధంగా ముందుకు వెళ్లాలని ఆయా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు రేవంత్ రెడ్డి సూచించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.


Similar News