వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలి

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సాయం అందించాలని రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు.

Update: 2024-09-12 16:24 GMT

దిశ, ఆర్మూర్ : వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సాయం అందించాలని రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీలోని భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష కార్యాలయంలో గురువారం ఆ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు, బీజేపీ సంస్థాగతంగా పాటించాల్సిన విధివిధానాలపై చర్చించారు.

    ఈనెల 20వ తేదీన రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎంపీలు ఈటెల రాజేందర్ , డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి. నగేష్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News