Presidents of Tuta : విశ్వవిద్యాలయాల అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు పెంచాలి..

దశాబ్ద కాలంగా పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డా. పున్నయ్య అన్నారు.

Update: 2024-07-18 15:23 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దశాబ్ద కాలంగా పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డా. పున్నయ్య అన్నారు. విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పున్నయ్య మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం 60 నుంచి 65 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర ఖాళీలను వెంటనే రిక్రూట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశానికి హాజరైన టూటా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ రివైజ్డ్ పేరివిజన్ కమిటీ -2016 ప్రకారం అధ్యాపకులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్‌లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ తీర్మానాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి ద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంకు పంపారు. ఈ సమావేశంలో టూటా ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి, కార్యదర్శులు డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ, కోశాధికారి డాక్టర్ ఈ. నాగరాజ్, ఈసీ మెంబర్లు డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News