పేదల సంక్షేమం కోరేదే కాంగ్రెస్ ప్రభుత్వం
పేదల అభివృద్ధి కోరేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు.
దిశ, ఎల్లారెడ్డి : పేదల అభివృద్ధి కోరేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 6 గ్యారంటీ పథకాలు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రస్తుతం రెండు గ్యారెంటీ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎల్లారెడ్డి, నియోజకవర్గంలో సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి మండలంలో హెల్ప్ డెస్క్ సెంటర్ ను ప్రారంభించి ప్రజల వద్దకు పాలనను కొనసాగే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, పథకం అమలు చేస్తుంందన్నారు. మిగిలిన నాలుగు గ్యారంటీ పథకాలను త్వరలోనే ప్రజలకు అందిస్తామన్నారు.