పదవీ విరమణ.. సన్మాన మహోత్సవంలో కన్నీటి పర్యంతం..

కోటగిరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మండలం జడ్పీటీసీ శంకర్ పటేల్ , జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్ ఉద్దీన్ ల పదవి విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

Update: 2024-07-13 11:11 GMT

దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మండలం జడ్పీటీసీ శంకర్ పటేల్ , జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్ ఉద్దీన్ ల పదవి విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవ్వడంతో సభా ప్రాంగణం ఒకసారిగా మూగబోయిది. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, పదవులు ఉన్నాలేకున్నా ప్రజల కోసమే పని చేస్తామని ఆయన అన్నారు. తమ రాజకీయ గురువు పోచారం శ్రీనివాస్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు.


Similar News