పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి...

నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి జరిపారు.

Update: 2024-07-10 16:30 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి జరిపారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.11 వేల నగదు సీజ్ చేశారు. అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిపై పేకాట కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా నగర శివారు ప్రాంతాలైన ముబారక్ నగర్, మాణిక్ బందర్, నాగారం, సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు రహస్య ప్రాంతాలను అడ్డాగా మార్చుకొని పేకాట రాయుళ్లు ప్రతిరోజు లక్షల రూపాయలకు పైగా చేతులు మారుతున్నాయి. అయితే అప్పుడో ఇప్పుడో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేస్తున్నారే తప్ప నగరంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయా పోలీసులు పేకాట స్థావరాలపై అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.


Similar News