కోడిపందేల స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పందెం కోళ్లు పోటీకి సై అంటున్నాయి.

Update: 2023-12-27 15:23 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పందెం కోళ్లు పోటీకి సై అంటున్నాయి. నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సీఐ అజయ్ బాబు సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో రుద్రూర్ గ్రామ శివరులో కోళ్లపందేల స్థావరం పై దాడి చేశారు. ఈ దాడిలో 13 కోళ్లను, 11 మంది కోళ్లపందేల రాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35,370 , కోడి కత్తులు 19 స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రుద్రూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Similar News