కాంగ్రెస్‌‌లో చేరిన తాడ్వాయి మండల బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు

Update: 2024-04-01 09:29 GMT

దిశ, తాడ్వాయి : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మండలానికి చెందిన బీఆర్ఏస్ నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ బండారి సంజీవులు తో పాటు విడిసి అధ్యక్షుడు మ్యాకల రాజు, ఏండ్రియల్ గ్రామ ఉప సర్పంచ్ సుధాకర్ రావు,భారత్ రావు, శశికాంత్ రెడ్డి,లను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ...కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. జహిరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్ షేట్కార్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, మన ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షౌకత్,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News