గంజాయి తాగలేదని తోటి విద్యార్థిని చితకబాదిన విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో గంజాయి కలకలం నెలకొంది.

Update: 2023-12-21 14:29 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో గంజాయి కలకలం నెలకొంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి గంజాయి తాగలేదని మిగతా విద్యార్థులు అతడిని చితక బాదిన సంఘటన కలకలం రేపింది. గంజాయి తాగాలని ఆ విద్యార్థిని బలవంతం చేయడంతో ఆ విద్యార్థి ససేమిరా తీసుకోక పోవడంతో తోటి విద్యార్థులంతా కలిసి గంజాయి సేవించని ఆ విద్యార్థిని చితకబాదారు. ఈ దాడిలో గాయపడిన విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఆ విద్యార్థి తరపు వ్యక్తుల నుంచి మాక్లూర్ పోలీసులు ఫిర్యాదు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


Similar News