రైస్ మిల్లులు నెలాఖరులోగా 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.

Update: 2023-12-21 12:01 GMT

దిశ, కామారెడ్డి : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తి చేయని 29 రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించారు.

     ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 50 శాతం లోపు మిల్లింగ్ లక్ష్యాలు ఉన్న యజమానులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లు యజమానులు పోటీ తత్వం అలవర్చుకొని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్లుల వారీగా సమీక్ష చేపట్టారు. సమావేశంలో జిల్లా పౌరసరపరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అభిషేక్ సింగ్, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డిప్యూటీ తహసీల్దారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.


Similar News