దేశ ఆర్థిక పురోగాభివృద్దే రాహుల్ గాంధీ లక్ష్యం : షబ్బీర్ అలీ

దేశ ఆర్థిక పురోగతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Update: 2024-06-19 09:04 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : దేశ ఆర్థిక పురోగతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేస్తూ పేదరికంలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలన్నారు.

రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఆయన జన్మదినం సందర్భంగా సరైన బహుమతి ఇచ్చిన వారు అవుతామని అన్నారు. అనుక్షణం పేదల పక్షపాతిగా నిలుస్తూ అదే విధంగా దేశంలోని ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం తో రాహుల్ గాంధీ పని చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉండవనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుండాన్, డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర అధ్యక్షులు కేశవేణు, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News