11 నుంచి యథావిధిగా ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 11 నుండి యథావిధిగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2023-12-09 13:20 GMT

దిశ, కామారెడ్డి : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 11 నుండి యథావిధిగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నెల 11 నుండి కలెక్టరెట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుండి ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులను అధికారులకు అందజేసి పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు. 

Similar News