వ్యభిచార గృహంపై పోలీస్ ల దాడి

నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఓ ఇంటిపై ఐదవ టౌన్ పోలీస్ లు దాడి చేశారు.

Update: 2024-04-04 13:35 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఓ ఇంటిపై ఐదవ టౌన్ పోలీస్ లు దాడి చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. దాంతో గురువారం సాయంత్రం ఐదవ టౌన్ ఎస్ఐ ఆశోక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ నిర్వాహకుడిని, ఇద్ధరు విటులను, ఐదుగురు మహిళలను గుర్తించారు. వారి వద్ధ నగదు, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి మహిళలను సఖీ కేంద్రానికి తరలించారు. 


Similar News