అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-01-22 05:41 GMT

దిశ, తాడ్వాయి : మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి గ్రామానికి చెందిన ముదాం శంకర్ (45) సోమరం గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన రక్తపు మరకలతో అతని పై బైక్ ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా దుండగులు రోడ్డు ప్రమాదంగా సృష్టించేందుకు ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలనుందని పోలీసులు తెలిపారు. ఈ విచారణలో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాసులు, తాడ్వాయి ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.


Similar News