ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న విచారణ..

నిజాంసాగర్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిధులు అక్రమాల ఫిర్యాదు పై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నిజాంసాగర్ మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ విచారణ కమిటీ సభ్యులు అమర్ సింగ్, భాస్కర్ తో కలిసి విచారణ ప్రారంభించారు.

Update: 2024-07-05 10:04 GMT

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిధులు అక్రమాల ఫిర్యాదు పై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నిజాంసాగర్ మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ విచారణ కమిటీ సభ్యులు అమర్ సింగ్, భాస్కర్ తో కలిసి విచారణ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా నిధులు అక్రమాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ పై జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధులు అక్రమాలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఆయా సంఘాల నాయకులు ఆందోళల చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా విచారణ కమిటీ పూర్తి స్థాయిలో నిబద్ధతతో విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.


Similar News