ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి

ట్రాక్టర్ ఢీకొని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(45) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని బాల్ నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది.

Update: 2024-03-31 14:56 GMT

దిశ, జక్రాన్ పల్లి : ట్రాక్టర్ ఢీకొని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(45) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని బాల్ నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ఏఎస్సై సుశీల్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం10 గంటల సమయంలో సికింద్రపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న అనే వ్యక్తి బాల్ నగర్ చౌరస్తాలో గల మటన్ దుకాణంలో మటన్ కొనుక్కొని తన స్కూటీపై సికింద్రపూర్ వస్తుండగా జాతీయ రహదారి పక్కన గల హెచ్పీ

    పెట్రోల్ పంపు ముందరకు రాగనే అదే సమయంలో వెనకాల నుండి వస్తున్న పడకల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఢీకొనడంతో బుర్రన్న తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్సై సుశీల్ కుమార్ తెలిపారు. మృతునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు బెహరన్ లో ఉంటాడు. చిన్న కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మృతుని భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దావఖానకు తరలించాన్నారు. 


Similar News