నా ఎన్నిక మోడీ కుటుంబ సభ్యుల విజయం

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నా ఎన్నికలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోడీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

Update: 2024-06-04 10:58 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నా ఎన్నికలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోడీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ హాల్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు.

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు. దేశంలో మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. నా గెలుపు తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 


Similar News