కుటుంబ కలహాలతో ఒకరి హత్య

బాన్సువాడ మండలంలోని మొగులన్ పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గ్రామానికి చెందిన రామగౌడ్ (55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

Update: 2023-12-27 10:58 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని మొగులన్ పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గ్రామానికి చెందిన రామగౌడ్ (55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రామగౌడ్ అనే వ్యక్తిని ఆయన భార్య, కుమారుడు ఇద్దరూ కలిసి ముందుగా హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా చెరువులో పడేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News