మోపాల్ కానిస్టేబుల్ సస్పెన్షన్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మోపాల్ పోలీస్ స్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్ మూర్తి ని సస్పెండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2023-12-16 15:49 GMT

దిశ , నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మోపాల్ పోలీస్ స్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్ మూర్తి ని సస్పెండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు మహిళల మధ్య జరిగిన గోడవలో కానిస్టేబుల్ తలదూర్చడమే సస్పెండ్ కి కారణమని తెలిసింది. అయితే.. మహిళల్లో ఒకరు సస్పెండ్ అయిన మూర్తి భార్యే కాగా.. మరొకరు ఏఆర్ ఇన్స్పెక్టర్ భార్య అని సమాచారం. కానిస్టెబుల్ , ఏఆర్ ఇన్స్ పెక్టర్ ఇళ్లు పక్కపక్కనే ఉండగా.. రెండ్రోజుల కిందట వీరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కానిస్టేబుల్ తలదూర్చి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీపీ విచారణ జరిపించి మూర్తిని విధుల నుంచి తప్పించారు.


Similar News