కామారెడ్డిలో అక్రమ లే అవుట్ ల పై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే...

కామారెడ్డి పట్టణంతో పాటు నియోజక వర్గ పరిధిలోని అక్రమ లే అవుట్ ల విషయంలో విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ప్రిన్సిపల్ సెక్రటరీ) శాంతి కుమారికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గురువారం వినతిపత్రం అందజేశారు.

Update: 2024-06-20 15:06 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంతో పాటు నియోజక వర్గ పరిధిలోని అక్రమ లే అవుట్ ల విషయంలో విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ప్రిన్సిపల్ సెక్రటరీ) శాంతి కుమారికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కామారెడ్డి పట్టణంలో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లే అవుట్ ల పై విచారణ చేపట్టాలని, అక్రమ కట్టడాల విషయంలో కూడా విచారణ చేపట్టాలని, ఓపెన్ ల్యాండ్ ల విషయంలో కొన్ని కబ్జాలకు గురయ్యాయని, మున్సిపల్ లో జరుగుతున్న అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. పట్టణంలో కొన్ని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కబ్జా కు గురయ్యాయని, అన్నింటి పై విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరారు.


Similar News