గంజాయి మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి

నిజామాబాద్ నగరంలో శుక్రవారం ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది.

Update: 2024-02-16 15:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో శుక్రవారం ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఎల్లమ్మగుట్ట కమాన్ వద్ద ఉండే గౌస్ పాషా అలియాస్ బాబన్ని అనే వ్యక్తిని అజయ్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఎల్లమ్మగుట్ట కమాన్ వద్ద గల కిరాణా షాపు ప్రాంతంలో జరిగింది. నగరంలోని 3వ టౌన్ ప్రాంతానికి చెందిన అజయ్ గత కొంత కాలంగా తన తల్లితో పాటు నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల ఏటీఎం దగ్గర నిరాశ్రయుడిగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మాన,

     సత్కర ర్యాలీలో తన తల్లికి పెన్షన్ రావడం లేదని కత్తితో హల్ చల్ చేశాడు. సాయంత్రం ఏం జరిగిందో తెలియదు కానీ ఓ కిరాణా షాప్ వద్ద తన పక్కన కూర్చున్న బాబన్నిపై గంజాయి మత్తులో అజయ్ దాడికి దిగాడు. ఈ సంఘటనలో బాబన్ని కడుపులో నుంచి పేగులు బయటకు రాగా అతన్ని హుటాహుటిన జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. అజయ్ పై మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు సమాచారం. నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


Similar News