రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఆలూరు మండల కేంద్రంలో గల కల్లెడ గ్రామానికి చెందిన సిరికొండ నర్సయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Update: 2023-12-16 15:45 GMT

దిశ ఆలూరు : ఆలూరు మండల కేంద్రంలో గల కల్లెడ గ్రామానికి చెందిన సిరికొండ నర్సయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పురుగు మందుల కోసం ఆర్మూర్ వెళ్తుండగా బైపాస్ రోడ్ లో నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్​ను టాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News