లెండి ప్రాజెక్టు‌ను ప్రారంభించాలి: ప్రొఫెసర్ కోదండరామ్

దశాబ్దాల క్రితం నిర్మితమై ఉమ్మడి రెండు రాష్ట్రాల ప్రాజక్టుగా పేరుగాంచిన లేండి ప్రాజెక్టున మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు విస్మరించాయని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Update: 2024-01-24 03:19 GMT
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దశాబ్దాల క్రితం నిర్మితమై ఉమ్మడి రెండు రాష్ట్రాల ప్రాజక్టుగా పేరుగాంచిన లేండి ప్రాజెక్టున మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు విస్మరించాయని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం లెండి ప్రాజెక్టు‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. 1984 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర సీఎం ఎస్బీ చౌహన్, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. 1987లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేశారన్నారు. సారవంతమైన భూమిలు కోల్పోయిన రైతులకు పునరావాసం కోసం అందోళనలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు.
2003లో ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ప్రభుత్వంతో నూతన అంచనా వ్యయాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చులు మహారాష్ట్ర 62%, ఉమ్మడి రాష్ట్ర వాటా 38% నిధులు ఖర్చు చేయాలని ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి పునరావాసం కలుపుతూ మొత్తం 800 కోట్ల రూపాయలు కావాలి.ఈ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లు ఉన్నాయి. 8 సంవత్సరాల క్రితం 10 గేట్లు పూర్తి చేశారు ఇంకా 4 గేట్లు పెండింగ్‌లో పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నీటి
సమార్థ్యం 6.36 టీఎంసీలుగా ఉంది. ఇందులో తెలంగాణకు వాటా 3.63 టీఎంసీ‌లు 23 వేల ఎకరాలతో జుక్కల్ నియోజకవర్గం పరిధిలో మద్నూర్, బిచ్చుకుందా మండలలో రైతులకు సాగు నీరు అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది. మొత్తం 19 కిలోమీటర్ల మేర కామన్ కెనాల్ సుమారు 8 కిలోమీటర్ల మేర అండర్ పైపులైన్ నిర్మాణ పనులు.. అంటే మద్నూర్ మండలం సరిహద్దు వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయాలనీ అంగీకారం కుదిరినట్లు గుర్తు చేశారు. ఈ రెండు రాష్ట్రలు నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణలో 25 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువకు పనులు 11 వందల ఎకరాల భూమి అవసరం ఉంది. 11 పిల్ల కాలువలో 8 మాత్రమే పూర్తి చేశారు. సర్వే చేసి 8 సంవత్సరాలు గడిచిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం లెండి ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా మిత్రపక్షంగా ఉన్నాం. అందుకే ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తమని అన్నారు. ఈ లెండి ప్రాజెక్టు పూర్తి అయితే మహారాష్ట్ర రైతులకు తెలంగాణ రైతులకు సాగునీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా :నిజ్జన రమేష్, మెడికల్ ఇంచార్జి శంకర్, డిపి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జుక్కల్ నియోజకవర్గ నాయకులు సబ్‌డే చందు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తుల్జ రెడ్డి రమేష్ రెడ్డి, హనుమంత్ రెడ్డి లు పాల్గొన్నారు.

Similar News