KCR's grandson Himanshu : మాక్లూరును సందర్శించిన కేసీఆర్ మనుమడు..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు మంగళవారం నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు వచ్చారు.

Update: 2024-08-06 09:51 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు మంగళవారం నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు వచ్చారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తమ్ముడు దిగాల మహేష్ గుప్తా కొడుకు ఆదిత్యతో కలిసి హిమాన్షు మాక్లూరుకు వచ్చినట్లు తెలిసింది. గ్రామంలో పాత ప్రభుత్వ పాఠశాల స్థలంలోనే కొత్తగా రూ.5.75 కోట్లతో పునర్ నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను హిమాన్షు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.

ఈ పాఠశాల నిర్మాణానికి బిగాల మహేష్ కుమార్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని గ్రామస్తులన్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులను చూడాల్సిందిగా గ్రామస్తులు కోరిన మీదట హిమాన్షు అయిష్టంగానే పాఠశాలకు వెళ్లినట్లు సమాచారం. అలా వెళ్లి ఇలా రాబోతున్న హిమాన్షును పాఠశాలలోని తరగతి గదులను కూడా పరిశీలించాలని గ్రామస్తులు కోరగా కొన్ని గదులను పరిశీలించి తిరిగి వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ మనుమడు ఊర్లోకి వచ్చాడన్న సమాచారం విని గ్రామస్తులు ఆయనను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు.

Tags:    

Similar News