సమీక్ష సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండల స్థాయి నాయకులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

Update: 2024-06-20 13:54 GMT

దిశ, జుక్కల్ :- గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండల స్థాయి నాయకులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ నిర్మాణం, సమస్యల పట్ల చర్చించారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలతో పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే విధంగా కృషి చేయాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే విధంగా కార్యకర్తలను ప్రోత్సహించాలని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్పత్వ వినోద్, కెమ్ రాజ్ కల్లాలి గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ గుప్తా, సొసైటీ డైరెక్టర్ విఠ్ఠ పటేల్. మాజీ ఎంపిటిసి ఇమ్రాన్ ఖాన్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్, బస్వాపూర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News