ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్యాంపు కార్యాలయం ప్రారంభం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్యాంపు కార్యాలయంను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ప్రారంభించారు.

Update: 2024-06-19 15:56 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్యాంపు కార్యాలయంను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ప్రారంభించారు. నగరంలోని మారుతినగర్ లో గల మాజీ ఎంపీ మధుయాష్కీ నివాసంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పట్టణ ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వినత పత్రం ఇవ్వడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు.

ప్రజలకు ఆరోగ్యశ్రీ , ఎల్ వో సి ల గురించి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుండే వారికి సేవలు అందించడానికి ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రేషన్ కార్డుల గురించి కానీ కొత్త పెన్షన్లు కానీ ఇందిరమ్మ ఇల్లు, తమ వాడలో నీటి సమస్య, రోడ్డు సమస్య, సానిటరీ సమస్య ఎలాంటి సమస్య ఉన్న ఇక్కడి నుండి పరిష్కరించుకోవడానికి ఎంతగానో పని చేస్తుందన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకు పూర్తి చేసామని, పార్లమెంట్ ఎన్నికల వలన మరికొన్ని హామీలు అమలు చేయడానికి కొంచెం సమయం పడుతుంది అన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో ప్రజా పాలనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులున్నారు.


Similar News