కాంగ్రెస్ లోకి పదవుల కోసం వెళ్లట్లేదు...అభివృద్ధి కోసం వెళ్తున్నా

గాంధారి మండలం అభివృద్ధి బాటలో పయనించేందుకు తన వంతు కృషిగా ఒక్క అడుగు ముందుకు వేసి భారాసా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు తాజా మాజీ గాంధారి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మమ్మాయి సంజీవ్ యాదవ్ తెలిపారు.

Update: 2024-04-13 15:18 GMT

దిశ, గాంధారి : గాంధారి మండలం అభివృద్ధి బాటలో పయనించేందుకు తన వంతు కృషిగా ఒక్క అడుగు ముందుకు వేసి భారాసా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు తాజా మాజీ గాంధారి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మమ్మాయి సంజీవ్ యాదవ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది భారాసా నాయకులతో కాంగ్రెస్లో చేరినట్లు తాజా మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ తెలిపారు. అభివృద్ధి పనులు అయిన సంగేమ్ రేవు వంతెన, గాంధారి సుభాష్ బొమ్మ నుండి మెయిన్ రోడ్ వరకు రోడ్డు నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మొఖరం చెరువు సుందరీకరణ పనులు, గాంధారి మినీ స్టేడియం వీటి గురించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.

    ఇన్ని రోజులు భారాసా పార్టీలో ఉన్న తనని ఆదరించిన ప్రజలకు ఎల్లవేళలా కృషి చేశానని, ఇప్పుడు అభివృద్ధి కోసం పార్టీ మారానని తెలిపారు. ఇప్పుడు కూడా ప్రజల అభీష్టం మేరకే పార్టీ మారానని, స్వార్థ రాజకీయాల కోసం కాదని అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ మాట్లాడుతూ తనకు అన్నివేళలా అండదండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు రుణపడి ఉంటానని, ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. ఇకముందు గాంధారి మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు తనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్ భారాసా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Similar News