రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు మృతి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మజివాడి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్ర గాయాల పాలై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Update: 2024-03-04 12:12 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మజివాడి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్ర గాయాల పాలై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సదాశివనగర్ కు చెందిన ఏనుగు జనార్దన్ రెడ్డి (49), అతని భార్య ప్రతిభ (42) పద్మాజివాడి గ్రామంలో

    బంధువుల అంత్యక్రియలకు స్కూటీ పై వెళ్తుండగా పద్మాజివాడి యూటర్న్ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రతిభ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆమె భర్త జనార్దన్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతిభ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడు జనార్ధన్ రెడ్డి ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.


Similar News