లాటరీలో కారు గెలిచావన్నాడు... రూ.45 వేలు కాజేశాడు...

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్​లో ఆన్​లైన్ మోసం జరిగింది.

Update: 2024-01-23 14:12 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్​లో ఆన్​లైన్ మోసం జరిగింది. నిఖిత అనే యువతికి మీషో ద్వారా మీకు లాటరీ లో కారు వచ్చింది అని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. కారు కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగారు. డబ్బులు అయితే 10 లక్షల 80 వేల రూపాయలు మీరు తీసుకోవచ్చని మెసేజ్ పంపించారు. దీనికి నిఖిత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిందిగా చెప్పాడు.

    దీనికి ఆమె లాటరీ వచ్చిందేమోనని నమ్మి మొత్తం 45 వేల 299 రూపాయలు క్యూ ఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపింది. దీంతో ఇంకా 50 వేల రూపాయలు కట్టమన్నాడు. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ అక్కడ నుండి మెసేజ్ వస్తుంది. ఫోన్ చేస్తున్నారు. తనకు డబ్బులు ఇప్పించాలని ఆమె వేడుకుంటున్నారు. 


Similar News