కల్లూరు లో ఘరానా మోసం...మహిళా సంఘాల 50 లక్షలు స్వాహా...

నలబై మహిళా సంఘాలకు సంబంధించిన సుమారు 50 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-16 10:22 GMT

దిశ, కోటగిరి : నలబై మహిళా సంఘాలకు సంబంధించిన సుమారు 50 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా సంఘాల సభ్యులు తెలిపిన కథనం ప్రకారం ఓ బ్యాంకు సంబంధించిన సిఎస్సి నిర్వకురాలు సంధ్య గ్రామంలోని ఖాతా దారులకి అవసరమయ్యె డబ్బులను వారి ఖాత లోనుండి తీసి ఇవ్వడం అలాగే వారి ఖాతలో జమా చేయడం వంటి లావాదేవీలు చేస్తుండేది. నమ్మకస్తురాలుగా ఉండడంతో నమ్మినా డ్వాక్రా సంఘాల మహిళలు వారు తీసుకున్న రుణాలకు సంబంధించి కిస్తులను ,అలాగే పొదుపును సిఎస్సి నిర్వాహకురాలు వద్ద జమా చేసేవారు.

గత తొమ్మిది నెలలుగా సదరు సిఎస్సి సెంటర్ నిర్వహకురాలు సుమారుగా 40 సంఘాల వారి నుంచి సుమారు 50 లక్షల రూపాయలను సంఘాల ఖాతలో కాకుండా వారి బంధువుల ఖాతా లోకి పంపింది. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న లోన్ పూర్తయిందని కొత్త లోన్ కావాలని సదరు ఐకేపీ సిబ్బంది అడుగగా ఇంకా మీ లోన్ పూర్తి కాలేదు అని చెప్పడంతో ఆందోళన గురైన మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు కి వెళ్లి ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో మహిళలు పెద్ద ఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళన దిగారు.


Similar News