మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య

మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2023-12-27 12:25 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన చాకలి బాబు (50) తన భార్య లలితతో కలిసి గత కొద్ది రోజుల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాబు తాగుడుకు బానిసై సరిగా కూలి పనులు చేయడం లేదు. ఈ క్రమంలో ఆయన స్వగ్రామం నాగిరెడ్డిపేట కు

    వచ్చి మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రించిన తర్వాత బుధవారం ఉదయం చాకలి బాబు లేవకపోవడంతో, మృతుని తమ్ముడు ఆయన నిద్రించిన గదిలోకి వెళ్లి చూడగా దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు దుర్గాప్రసాద్, విష్ణులు ఉన్నట్లు తెలిపారు. చాకలి బాబు తాగుడుకు బానిసై జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు, మృతుని భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.


Similar News