హెచ్​ఎంకు డాక్టరేట్

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన మెత్రి నాగయ్య మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Update: 2024-02-17 15:55 GMT

దిశ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన మెత్రి నాగయ్య మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా హైస్కూల్ ప్రధా నోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు తొలోసా మెక్సికో అమెరికా యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగయ్య మాట్లాడుతూ తన పనిని గుర్తించి డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొలోస యూనివర్సిటీ కోఆర్డినేటర్స్ కట్ట భూమన్న, రాజేశ్వర్, జనార్దన్, పోతంగల్ మాజీ సర్పంచ్ సూదం విట్టల్, కోటగిరి మండల దళిత నాయకులు బ్యాగరీ రాములు, పుప్పాల సైదయ్య, గాయక్వాడ్ రాము పాల్గొన్నారు.


Similar News