మల్టీ జోన్ పరిధిలో సీఐల బదిలీలు..

మల్టీ జోన్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పీసీఆర్ లో పనిచేస్తున్న రాజేశ్వర్ రెడ్డిని మెదక్ రూరల్ సీఐగా బదిలీ చేశారు.

Update: 2024-06-22 15:14 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మల్టీ జోన్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పీసీఆర్ లో పనిచేస్తున్న రాజేశ్వర్ రెడ్డిని మెదక్ రూరల్ సీఐగా బదిలీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ లో అటాచ్ డ్యూటీలో పని చేస్తున్న సురేష్ ను సీసీఎస్ 1సీఐ రమేష్ ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్ సీఐ రమేష్ ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు వివాదాల్లో చిక్కుకున్నారు.

మే నెలలో ఒకసారి సస్పెన్షన్ కాగా, జూన్ లో పోస్టింగ్ ఇచ్చారు. బక్రీద్ ఒక రోజు ముందు మద్యం మత్తులో వివాదంలో చిక్కుకోగా అతనిపై వేటు వేయకుండా ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐజీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న రవీంధర్ ను నిజామాబాద్ సీసీఎస్ 3కి బదిలీ చేయగా ఎల్లయ్యగౌడ్ ను నిజామాబాద్ వీఆర్ కు పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తంను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి బదిలీ చేశారు.


Similar News