ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యం

లింగంపేట మండలం బానాపూర్ గ్రామానికి చెందిన డప్పు నవనీత ఇద్దరు పిల్లలతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

Update: 2023-12-19 09:23 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలం బానాపూర్ గ్రామానికి చెందిన డప్పు నవనీత ఇద్దరు పిల్లలతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గత పది రోజుల క్రితం ఇద్దరు కుమారులైన శ్రీహాన్, ప్రణయిని తీసుకొని నవనీత ఇంటి నుండి వెళ్లిపోయినట్టు తెలిపారు. నవనీత ఆచూకీ కోసం బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లభించకపోవడంతో నవనీత తండ్రి నర్సింలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నవనీత ఆచూకీ గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ప్రభాకర్ కోరారు.


Similar News