దిశ ఎఫెక్ట్… "సర్వేకు" ఆదేశం

బోధరాగు వరద కాలువ కనుమరుగు శీర్షికన "దిశలో" వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

Update: 2024-06-30 14:54 GMT

దిశ, భిక్కనూరు: బోధరాగు వరద కాలువ కనుమరుగు శీర్షికన "దిశలో" వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. భిక్కనూరు మండల కేంద్రంలో కాలువ కబ్జా చేసి ఫార్మా కంపెనీ యాజమాన్యం ప్రహరి నిర్మించిందన్న విషయమై ప్రముఖంగా జిల్లా టాబ్లాయిడ్ లో ప్రచురితమైన వార్త కు స్పందించిన అధికారులు సర్వేయర్ తో సర్వే నిర్వహించాలని ఆదేశించినట్లు భిక్కనూరు తహసిల్దార్ శివ ప్రసాద్ ఆదివారం సాయంత్రం "దిశ "తో మాట్లాడుతూ చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ సర్వేకు ఆదేశించినట్లు వివరించారు. కాలువ కనుమరుగు కథనం వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. అంతేకాకుండా పలువురు స్టేటస్ గా పెట్టుకొని ఈ అన్యాయాన్ని అరికట్టాలంటూ పోస్టులు కూడా పెట్టారు.


Similar News