అండర్ ట్రయల్ ఖైదీ మృతి

నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు గుండెపోటుతో చనిపోయారు.

Update: 2024-03-04 09:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతం కు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు రాగా తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.


Similar News