కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర

ఫిట్నెస్ మీద అవగాహన కల్పించడానికి కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసిన విద్యార్థినిని జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.

Update: 2024-01-22 14:12 GMT

దిశ, కామారెడ్డి : ఫిట్నెస్ మీద అవగాహన కల్పించడానికి కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసిన విద్యార్థినిని జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. హైదరాబాద్ సైక్లింగ్ గ్రూపు వారు 13 మంది సభ్యులతో కలిసి ఫిట్నెస్ మీద అవగాహన కల్పించడానికి కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు 3890 కిలో మీటర్లు 23 రోజుల్లో పూర్తి చేశారు. ఇందులో ఒకరు మాచారెడ్డి మండలం సోమార్పేట గ్రామానికి చెందిన సాందీపని జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న బానోత్ వెన్నెల ఉన్నారు. అభినందించిన వారిలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిణి కాజల్ సింగ్ ఉన్నారు. 


Similar News