రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది.

Update: 2023-12-14 15:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంచిప్ప రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరిగింది. నిజామాబాద్ కామారెడ్డి రహదారిపై దగ్గి _చాంద్రాయణ పల్లి అటవీ ప్రాంతంలోని రహదారి పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి వెంట వెళ్తున్న ప్రయాణికులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 


Similar News